రాయదుర్గంలో సెంటర్ ప్రారంభించిన కెటిఆర్
ఇంటెల్ హైదరాబాద్లో సెంటర్ ఏర్పాటు అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో క్వాలిటీ మానవవనరులుఅందుబాటులో ఉన్నాయి కాబట్టే.. ఐటీ రంగంలో దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. రాయదుర్గంలో ఇంటెల్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బెంగళూరు తర్వాత రెండో సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించిన ఇంటెల్ దాదాపు 1500 మంది ఉద్యోగులు కూర్చొని పని చేసే సామర్థ్యంతో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. టీహబ్, విహబ్, ఐఐటీ లాంటి టాస్క్ లాంటీ సంస్థలు హైదరాబాద్లో ఇప్పటికే ఉండగా.. గూగుల్, అమేజాన్, ఓన్ప్లస్లాంటి అనేక ఐటీ, రీసెర్చ్ కంపెనీలు.. నగరంలో తమ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు.
వచ్చే నాలుగేళ్లలో ఎలక్టాన్రిక్స్ అండ్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా పనిచేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఏప్రిల్లో టీ వర్కస్ ఆవిష్కరిస్తామన్నారు. ఐటీ అభివృద్ధికి జయేష్ రంజన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. ఎలక్టాన్రిక్స్ మానిఫ్యాక్చరింగ్ రంగంలో వచ్చే నాలుగేళ్లలో మూడు లక్షల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజాతో పాటు పలువురు పాల్గొన్నారు.