కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 125 గాజుల రామారం డివిజన్ వీనస్ ఎన్క్లేవ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సదాశివరెడ్డి వారి మిత్రబృందం ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత నగర శివారు ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతం అయిందన్నారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీలలో మౌలిక వసతులైన సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలను కల్పించామని అన్నారు. ఎన్నికల అనంతరం అభివృద్ధిని కొనసాగించేందుకు ముచ్చటగా మూడవసారి మూడవ నెంబర్ పై ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. అనంతరం దీన్ దయాల్, విజయలక్ష్మి దేవి, రాహుల్, తిరుపతి రెడ్డి, డామినిక్స్, రాజశేఖర్ రెడ్డి, ప్రసాద్, రేఖ, సంధ్యారాణి, చంద్రాలతో పాటు 50 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, కమలాకర్, నవాబ్, తెలంగాణ సాయి, చిన్న చౌదరి, సురేష్, శ్రీనివాస్ రావు, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.