అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందుంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 23 : సమైక్యాంధ్ర పాలనలో వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రం నేడు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్  ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రూ. వెయ్యి పెంచిన ప్రోసిడింగ్ ను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలోని 7 మండలాలు, రెండు మున్సిపాలిటీ లలోని దివ్యాంగులకు సమావేశం ఏర్పాటు చేసి అందజేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ, మైనార్టీ దళిత బంధు అంచలంచలుగా ఇవ్వడమే కాకుండా ప్రణాళికతో పార్టీలకతీతంగా ఇచ్చే ప్రణాళిక జరుగుతుందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన అన్నారు. ఉద్యమనేతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం లక్ష లోపు ఉన్న రైతుల కు రుణమాఫీ జరిగిందని త్వరలోనే అన్ని కుల వృత్తుల వారికి రూపాయలు లక్ష ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అనురాధపత్యానాయక్, విజితా రెడ్డి, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, కౌన్సిలర్ కమటం రాధమ్మ వెంకటయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నిట్ట నారాయణ, వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page