ఆదివాసులు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలి

ఆర్థిక అభివృద్ధి సాధించాలి,
విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
ఆదివాసుల,గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి  చేయాలి
-రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  జిల్లా ఉన్నత అధికారులకు సూచన

ములుగు, ప్రజాతంత్ర, ఆగస్ట్   27: అడవిని నమ్ముకుని జీవించే నిర్మలమైన మనసు గల ఆదివాసుల, గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచించారు. మంగళవారం గవర్నర్  మూడు రోజుల పర్యటనలో భాగంగా ములుగు జిల్లాకు చేరుకున్నారు. ముందుగా యాదాద్రి జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో ములుగు జిల్లా  ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. గవర్నర్ కు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు , జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీ, తదితరులు పూల మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యంతో మహిళలు, చిన్నారులు గవర్నర్ కు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఉన్నత అధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓ లు ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి కీ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.గవర్నర్ జిల్లా అభివృద్ధిపై ఆసక్తి చూపారు.
ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ.. తాను గవర్నర్  గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటనగా షెడ్యూల్ ప్రాంతమైన ములుగు జిల్లాకు వచ్చినట్లు పేర్కొన్నారు.  తాను కుడా గతంలో పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు.  ప్రభుత్వ పథకాలు బాగున్నాయని  ప్రశంసిచారు, ముఖ్యంగా విద్య , వైద్య రంగాల్లో అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజనులు ఆదివాసులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆధునిక సమాజంలో ఆదివాసులు గిరిజనులను భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయన్నారు. వీరి కోసం జిల్లాలో కంటైనర్ హాస్పిటల్ వినూత్నంగా ఏర్పాటు చేయడంపై మంత్రి సీతక్కను అభినందించారు. ఆదివాసీ, గిరిజన గ్రామాల అభివృద్ధికి  నిరంతరం కృషి  చేయాలని, మీరంతా అత్యుత్తమంగా విద్యను అభ్యసించి నవ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలనీ గవర్నర్ పేర్కొన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ తొలిసారి జిల్లా పర్యటనకు గవర్నర్ రావడంపై జిల్లా ప్రజల తరుఫున కృతజ్ఞతలు తెలిపారు.
ములుగు జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం  ఉన్నదని, 30 శాతం మంది ఆదివాసులు, గిరిజన ప్రజలు ఈ జిల్లాలో నివసిస్తన్నారని అన్నారు. ప్రజలంతా ఐకమత్యంతో నివసిస్తూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదని తెలిపారు. ఆదివాసుల గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తున్నదని తెలిపారు. ఆసియా ఖండం లో అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం మహాజాతార ప్రతీ రెండేళ్లకు  ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ జాతర జాతీయ పండుగగా గుర్తించేలా  చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కోరారు. ములుగు జిల్లా చరిత్ర, పర్యాటక కేంద్రాలు, జిల్లా విశిష్టత, విశేషాలను గవర్నర్ కు వివరించారు. జిల్లా కలెక్టర్  దివాకర మాట్లాడుతూ.. జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితంగా మాతృ మరణాల రేటు, శిశు మరణాల రేటు తగ్గాయని పేర్కొన్నారు. మంత్రి ప్రత్యేక చొరవ తో గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాలను తగ్గించినట్లు తెలిపారు. సమ్మక్క, సారలమ్మ యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయని తెలిపారు.  జిల్లా లో అడవులు సంరక్షణ కు అన్ని తీసుకొంటున్నామని, క్రైమ్ రేట్ తగ్గిందని పేర్కొన్నారు.
మంత్రి సీతక్క గవర్నర్, ప్రిన్సిపాల్ సెక్రటరీలను శాలువా తో సత్కరించారు. ఆదివాసీ చిత్రాలకు సంబంధించిన జ్ఞాపకాలను బహుకరించారు. అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో  రాష్ట్ర గవర్నర్  జిల్లాకు చెందిన  రచయితలు, కవులు, కళాకారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడా అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులలు (ప్రొఫెసర్ పాండురంగారావు) ఇన్ టాక్ , డాక్టర్ రాచర్ల గణపతి, (రచయిత) డాక్టర్ అంబటి శ్రీజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, చల్ల మౌనిక, (రెజ్లింగ్ క్రీడాకారిని,) పి రజిత, (జిమ్నాస్టిక్,) పాలడుగు వెంకటేశ్వరరావు, (వాలీబాల్ గోల్డ్ మెడలిస్ట్) కాజంపురం దామోదర్, (ఎన్విరాన్మెంట్ సైన్సిస్ట్) కొమరం ప్రభాకర్, (సోషల్ వర్కర్) నేషనల్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత, డాక్టర్ కొండల రామయ్య, (మ్యాథమెటిక్స్ టీచర్) తదితరులతో సమావేశం ఐయ్యారు. జిల్లా కు జాతీయ అంతర్జాతీయ స్థాయి లో పేరు ప్రాఖ్యతులు తీసుకురావడం పట్ల వారిని అభినందనలు తెలిపారు. ప్రొఫెసర్ పాండు రంగా రావు రామప్ప దేవాలయం, నిర్మాణం, సాండ్ బాక్స్ టెక్నాలజీ, ఆలయ విశిష్టత వివరించారు.

మహా అద్భుత కట్టడం రామప్ప దేవాలయం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
రామప్ప శిల్ప సంపద రమణీయం
-నీటి పై తేలియాడే ఇటుక ప్రత్యక్షంగా తిలకించిన రాష్ట్ర గవర్నర్

 
image.png

వెంకటాపూర్ ,ప్రజాతంత్ర ,ఆగస్ట్  27: రామప్ప దేవాలయం మహాద్భుత కట్టడమని, దేవలయ శిల్ప సంపద రమణీయంగా ఆకర్షణీయంగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. మంగళవారం  ములుగు జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ రామప్ప దేవాలయానికి మంత్రి  దనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యేలు తెల్లం  వెంకటరావు , గండ్ర సత్యనారాయణ రావు, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్,ఎస్పీ శబరిష్ తో కలిసి రామప్ప దేవాలయానికి చేరుకున్నారు. మొదటగా రాష్ట్ర గవర్నర్ ఆలయ ప్రాంగణం లో పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు. రుద్రేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద పండితులు ఆలయ మండపంలో గవర్నర్ ను పట్టు వస్త్రాలతో సత్కరించి  ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు.అనంతరం ప్రొఫెసర్ పాండురంగారావు రామప్ప దేవాలయంలోని నీటిపై తేలియాడే ఇటుకల గురించి  గవర్నర్ కు వివరించారు. ఆలయ చరిత్ర , శిల్పసంపద రమణీయత ఆలయ గైడ్ కు వివరించారు.
అనంతరం రాష్ట్ర గవర్నర్ మీడియా తో మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం కట్టడం, చరిత్ర , శిల్ప సంపద, ఎంతో రమణీయంగా ఉందని దేవాలయాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం రామప్ప హరిత కాటేజ్ లను, సరస్సును  సందర్శించారు. కార్యక్రమంలో ఐటిడిఏ ఏటూరు నాగారం పిఓ చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్ , అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, ఆర్డీవో సత్యపల్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page