కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి  అత్యధిక మెజార్టీతో గెలిపించండి  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 21:   బిఆర్ఎస్, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసే పార్టీలకు ఓటు వేస్తే ప్రగతి శూన్యం అవుతుందని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ డివిజన్ లో ఓల్డ్  రామంతపూర్, భరత్ నగర్, గాంధీనగర్, జన ప్రియ, శ్రీ రామ కాలనీ, అరవింద్ నగర్ ,నేతాజీ నగర్, ఇందిరానగర్, ప్రగతి నగర్ లో ఉప్పల్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావుతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మొద్దని , మోసపూరితమైన హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని, ఆ పార్టీలకు ఓటు వేస్తే ప్రగతి శూన్యం అవుతుందని, ప్రభాకర్ అన్నారు. రాబోయే ఈ అసెంబ్లీ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page