కెసిఆర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తా : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

ఉప్పల్ ప్రజాతంత్ర జులై 14: కెసిఆర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తానని నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ కేసీఆర్ కాలనీ వాసుల అభ్యర్థన మేరకు బాలకృష్ణ నగర్, కెసిఆర్ కాలనీలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ కాలనీ వాసులు తమ సమస్యలను బొంతు రామ్మోహన్ కి వివరించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) మరియు రోడ్లు కావాలని, వాటర్ బిల్ మూడు రెట్లు అధికంగా వస్తుంది అని, నోటరీ పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ని కోరగా, ఇట్టి సమస్యలకి సానుకూలంగా స్పందించన రామ్మోహన్ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగె రాజ్యాంగ నిర్మాత డా”బి అర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కెసీఅర్ నగర్ లో నిర్మాణం లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ పనులను పరిశీలించి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు గంథం నాగేశ్వరావు, హనుమంత్ రెడ్డి, బీఅర్ఎస్ నాయకులు ఇంద్రసేన రెడ్డి, మధుసూధన్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page