సామాన్యులపై పన్ను భారాన్ని తగ్గించింది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూ దిల్లీ, జూలై 23 : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ‘కేంద్ర బడ్జెట్ 2024-25’ను ప్రవేశపెడుతూ, జిఎస్టి వాణిజ్యం, పరిశ్రమలకు సమ్మతి భారం కలిగించడంతో పాటు, లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించిందని, అదే సమయంలో సామాన్యుడిపై పన్ను భారాన్ని తగ్గించిందని అన్నారు. జిఎస్టిని ఘనవిజయంగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, జీఎస్టీ చట్టంలో పలు సవరణలు చేశారు. దీని ప్రకారం మద్యం తయారీలో ఉపయోగించే అదనపు తటస్థ ఆల్కహాల్ను ఈ కేంద్ర పన్ను పరిధి నుంచి మినహాయించనున్నారు. ఐజీఎస్టీ, యూటీజీఎస్టీ చట్టంలోనూ ఇదే తరహాలో సవరణలు చేశారు. ఇంకా, కొత్తగా జోడిరచిన ఆర్టికల్ 11ఎ వ్యాపారంలో ప్రబలంగా ఉన్న ఏదైనా సాధారణ పద్ధతి కారణంగా ఈ కేంద్ర పన్నును విధించకుండా లేదా తక్కువగా విధించడాన్ని నియంత్రించడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. సిజిఎస్టిలోని సెక్షన్ 16లో రెండు కొత్త ఉప-విభాగాలను చేర్చడం ద్వారా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందే కాల పరిమితి సరళీకృతం చేయబడిరది.
డిమాండ్ నోటీసులు, ఉత్తర్వులు జారీ చేయడానికి సాధారణ కాలపరిమితిని కూడా సవరించిన చట్టం కల్పిస్తుంది. పన్ను డిమాండ్, వడ్డీ చెల్లింపుతో పాటు పెనాల్టీ తగ్గింపు ప్రయోజనాన్ని పొందడానికి పన్ను చెల్లింపుదారులకు కాలపరిమితిని 30 రోజుల నుంచి 60 రోజులకు పొడిగించారు. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడానికి, అప్పిలేట్ అథారిటీ వద్ద అప్పీల్ దాఖలు చేయడానికి గరిష్ట ప్రీ డిపాజిట్ మొత్తాన్ని కేంద్ర పన్ను రూ. 25 కోట్ల నుండి రూ. 20 కోట్లకు తగ్గిస్తున్నారు. అప్పిలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ దాఖలు చేయడానికి ముందస్తు డిపాజిట్ మొత్తాన్ని గరిష్టంగా రూ.50 కోట్లతో 20 శాతం నుంచి గరిష్టంగా రూ.20 కోట్ల కేంద్ర పన్నుతో 10 శాతానికి తగ్గిస్తున్నారు.
అంతే కాకుండా, అప్పిలేట్ ట్రిబ్యునల్లో అప్పీళ్లను దాఖలు చేయడానికి కాల పరిమితి కూడా 1 ఆగస్టు 2024 నుండి అమలులోకి వొచ్చేలా సవరించబడుతుంది. అప్పిలేట్ ట్రిబ్యునల్ పని ప్రారంభించని దృష్ట్యా అప్పీళ్లలో సమయం వృథా కాకుండా ఉంటుంది. ఇది కాకుండా, అనేక ఇతర మార్పులు చేయబడ్డాయి. ఉదాహరణకు, లాభాపేక్ష నిరోధక కేసులను నిర్ధారించడానికి జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ను సూచించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. ఇది వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుంది. జిఎస్టి విజయాన్ని ప్రస్తావిస్తూ, ప్రయోజనాలను రెట్టింపు చేయడానికి, పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకరించి హేతుబద్ధీకరించామని, మిగిలిన రంగాలకు విస్తరించామని ఆర్థిక మంత్రి చెప్పారు.