జాబ్ క్యాలెండర్ ఊసే లేదు
యువమోర్చా ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20: నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్లో భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్రెడ్డి జాబ్ క్యాలెండర్ విషయమే మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హాలన్నీ విస్మరించారన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటోందని.. ఆ పార్టీకి ప్రజలందరూ స్వస్తి చెబుతారన్నారు. ‘కాంగ్రెస్ నాయకులు ఎవరికి దొరికినంత వారు దోచుకుంటున్నారు. రాష్ట్రంలో విస్తారంగా అవినీతి కొనసాగుతోంది. అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో మాత్రమే రాష్ట్రంలో మార్పు వచ్చింది.
హాలన్నీ వంద రోజుల్లో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి. గతంలో ప్రజల తీర్పును కాలరాసి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భారాసలో చేర్చుకున్నారు. రాష్ట్రంలో కేవలం జెండా మాత్రమే మారింది. ప్రజావాణి వినిపించడంలో భాజపా కృషి చేస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి. రేవంత్ రెడ్డి ఇచ్చిన హా మేరకు గ్రూప్ 2లో 783 పోస్టులను 2000కు పెంచాలి. 1365 గ్రూప్ 3 పోస్టులను 3000కు పెంచాలి. హా ఇచ్చినట్లుగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పక్రియను వెంటనే చేపట్టాలి. మెగా డీఎస్సీలో భాగంగా 25 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి. నిరుద్యోగులకు వెంటనే రూ.4 వేల భృతిని విడుదల చేయాలి‘ అని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.