పశ్చిమాసియాలో సంక్షోభాలు ఆందోళనకరం

యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదు
పోలండ్‌ ‌ప్రధాని డొనాల్డ్ ‌టస్క్‌తో భేటీలో ప్రధాని మోదీ

వార్సా, ఆగస్ట్ 22 : ఉ‌క్రెయిన్‌తో పాటు పశ్చిమాసియాలోకొనసాగుతున్న సంక్షో భాలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన.. చర్చలు, సంప్రది ంపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమై నంత త్వరగా శాంతి, స్థిరత్వం పునరుద్ధ రణకు తాము మద్దతు తెలుపుతా మన్నారు. పోలండ్‌ ‌ప్రధాని డొనాల్డ్ ‌టస్క్‌తో భేటీ అయిన తర్వాత వ్నిడి యాకు విడుదల చేసిన సంయుక్త ప్రకట నలో ఈ విషయాన్ని వెల్లడిం చారు. ఉక్రెయిన్‌, ‌పశ్చిమాసియాలో కొనసా గుతున్న యుద్ధాలు మనందరికీ తీవ్ర ఆందోళనకరమని, యుద్ధక్షేత్రంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకదని భారత్‌ ‌బలంగా విశ్వసిస్తుందని, ఏ సంక్షోభం లోనైనా సామాన్యులు ప్రాణాలు కోల్పో వడం యావత్‌ ‌మానవాళికే అతిపెద్ద సవాల్‌ అని అన్నారు.

 

చర్చలు, దౌత్యం తోనే శాంతి, స్థిరత్వానికి తాము మద్దతిస్తామని, ఇందుకోసం మిత్రదేశా లతో కలిసి అన్నిరకాల మద్దతు ఇచ్చేం దుకు భారత్‌ ‌సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలండ్‌ ‌వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్ ‌టస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భ ంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించామని.. ఇరుదేశాలు తమ సంబంధాలను వ్యూహా త్మక భాగస్వామ్యంగా మార్చుకో వాలని నిర్ణయిం చుకున్నామన్నారు. రష్యా దండయాత్ర సమయంలో భారత విద్యార్థుల తరలింపునకు పోలండ్‌ ఎం‌తో సహకరించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.

అంతకు ముందు అక్కడి ప్రధాన మంత్రి కార్యాలయం’ఛాన్స్‌లరీ’లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. భారత్‌-‌పోలండ్‌ ‌భాగస్వామ్యంలో సరి కొత్త మైలురాయంటూ..వార్సాలోని ఫెడరల్‌ ‌ఛాన్స్‌లరీలో భారత ప్రధానికి పోలండ్‌ ‌ప్రధాని డొనాల్డ్ ‌టస్క్ ‌ఘనస్వా గతం పలికారు. 45 ఏళ్ల అనంతరం భారత ప్రధాని పోలండ్‌లో చేపట్టిన ఈ పర్యటన ఇరుదేశాల భాగస్వామ్యానికి సరికొత్త ఊపునిస్తుందని భారత విదేశా ంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ ‌జైశ్వాల్‌ ‌పేర్కొన్నారు.

ఈ విషయంపై పోలండ్‌ ‌ప్రధాని టస్క్ ‌స్పందిస్తూ.. చివరకు, 45 ఏళ్ల అనంతరం.. భారత ప్రధానిని వార్సాలో చూడటం సంతోషం గా ఉందని ఎక్స్‌లో పోస్టు చేశారు. భేటీలో భాగంగా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. ఆ తర్వాత పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ ‌సెబాస్టి యన్‌ ‌దుడాతోనూ మోదీ భేటీ అయ్యా రు. ప్రధాని మోదీ పోలండ్‌ ‌పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌. ‌జైశంకర్‌.. ఆ ‌దేశ విదేశీ వ్యవహారాల మంత్రి రాడోస్లావ్‌ ‌సికోర్క్సీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌ ‌సంక్షోభం, ఇండో-పసిఫిక్‌లో ద్వైపాక్షిక సహకా రంపై చర్చించినట్లు ఎస్‌.‌జైశంకర్‌ ‌పేర్కొ న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page