బాలపూర్‌ను మించిన రిచ్‌మండ్‌ ‌విల్లా

రూ.కోటి కి పైగా ధ‌ర ప‌లిక‌న లడ్డూ..
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌ హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో గ‌ల‌ కీర్తి రిచ్‌మండ్‌ ‌విల్లా లో నిర్వ‌హించిన గ‌ణేష్ ల‌డ్డూ వేలం స‌రికొత్త రికార్డును సృష్టించింది.  ఇక్కడ ఏటా భారీ ధరకు లడ్డూ వేలం పాట నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఉన్నవారంతా ధనవంతులు కావడంతో లడ్డూ వేలం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా రికార్డు ధరకు లడ్డూను పాడుకున్నారు. సుమారు కోటి రూపాయలకు పైగానే వేలం పాడినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page