మణుగూరు ,ప్రజాతంత్ర ,నవంబర్ 3: కట్టుకున్న భార్యని గొడ్డలితో నరికి చంపిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే మణుగూరు మండలం సమితి సింగారంలో మాజీ సింగరేణి ఉద్యోగి గట్టి గొప్ప రాములు భార్య గొట్టు కొప్పుల మంగతాయారు (60) కలిసి జీవిస్తున్నారు. గత కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.