హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : నాస్కామ్ ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్లోనే సృష్టించినట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. సోమవారం కోకాపేటలో మైక్రోచిప్ టెక్నాలజీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సంర్భంగా మంత్రి మాట్లాడుతూ…రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని అన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నదని చెప్పారు. లైఫ్సైన్సెస్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశానికి లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ హైదరాబాద్లో ఉందని కెటిఆర్ వెల్లడించారు.