రేవంత్‌ ‌ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

  • ఎప్టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు
  • దుర్గం చెరువు ఎప్టీఎల్‌ ‌పరిధిలో పలు నిర్మాణాలకు అందచేత
  • సిఎం రేవంత్‌ ‌సోదరుడి ఇంటికీ నోటీసుల అతికింపు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: ‌చెరువుల కబ్జాలపై రేవంత్‌ ‌ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎప్టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు అందజేసింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని 5 చెరువుల పరిధిలోని ఎప్టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌లలో నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది. 5 చెరువుల పరిధిలో 204 నిర్మాణ యజమానులకు నోటీసులు జారీ చేసింది. దుర్గం చెరువు ఎప్టీఎల్‌ ‌పరిధిలో నెక్టర్స్ ‌కాలనీ, డాక్టర్స్ ‌కాలనీ,కావూరి హిల్స్, అమర్‌ ‌సొసైటీ వాసులకు 77 నోటీసులు అందజేసింది. పలు ఇళ్లకు నోటీసులను సైతం శేరిలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది అంటించారు. నెల రోజుల గడువు ఇస్తూ ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు. దుర్గం చెరువులో ఒక్కరోజే నాలుగు కాలనీల్లోని వందల ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు రేవంత్‌ ‌ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) ‌కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. యజమానులు కూల్చకుంటే ఓకే.. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరికలు జారీ చేసింది.

హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌.. ఎన్‌ ‌కన్వెన్షన్‌ ‌కూల్చివేత తర్వాత పెద్దగా బయటకు వచ్చింది లేదు. కార్యాలయంలోనే ఉంటూ అధికారులతో సమావేశాల ద సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. అందరూ అనుకున్నట్టే జరిగింది. మరో బాంబ్‌ ‌పేల్చేందుకు కాస్త సమయం తీసుకుంటున్నారని అంతా భావించారు. చివరకు అదే జరిగింది. మొత్తానికి హైడ్రా పెద్ద బాంబే పేల్చింది. చెరువుల పరిధిలో 204 నిర్మాణ యజమానులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ’రు కూల్చేస్తారా? లేదంటే మమ్మల్ని కూల్చేయమంటారా?’ అంటూ అల్టిమేటమ్‌ ‌జారీ చేశారు. చెరువుల కబ్జాలపై సీరియస్‌గా ఉన్న రేవంత్‌ ‌సర్కార్‌ ‌సంచలన నిర్ణయాలకు ఏమాత్రం వెనుకాడటం లేదు. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులను అంటించి షాక్‌ ఇచ్చారు. తప్పు చేస్తే సోదరుడైనా వదిలేది లేదని రేవంత్‌ ‌తేల్చి చెప్పారు. మాదాపూర్‌ అమర్‌ ‌కో-ఆపరేటివ్‌ ‌సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

మొత్తానికి రేవంత్‌ ‌సర్కార్‌ ఎవ్వరినీ వదిలేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌ ‌సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి ’హైడ్రా’ అధికారులు నోటీసులు అంటించారు. మాదాపూర్‌లోని అమర్‌ ‌కో-ఆపరేటివ్‌ ‌సొసైటీలో ఆయన నివాసముంటున్నారు. ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నోటీసులు అంటించారు. మరో వైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, ‌నెక్టర్స్ ‌కాలనీ, డాక్టర్స్ ‌కాలనీ, అమర్‌ ‌సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసుల్లో హైడ్రా అధికారులు పేర్కొన్నారు. హైడ్రా నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు.

తన ఇల్లు ఐఎఫ్‌టిఎల్‌ ‌పరిధిలో ఉంటే కూల్చేయండని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ’2015లో మాదాపూర్‌ ‌లోని అమర్‌సొసైటీలో ఇల్లు కొన్నాను.. కొనుగోలు సమయంలో చెరువు పరిధిలో ఉందనే సమాచారం లేదు. అలావుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు’ అని తెలిపారు. కాగా.. దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, ‌నెక్టర్స్ ‌కాలనీ, డాక్టర్స్ ‌కాలనీ, అమర్‌ ‌సొసైటీ వాసులకు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ‌లోని నాలాలు, చెరువులను కబ్జాల నుంచి కాపాడేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హైడ్రా కమిషన్‌ ‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నగరంలో నాలాలను కబ్జా చేసి కట్టిన పలు కట్టడాలను అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page