రైతులను ఆందోళనకు గురి చేసిన కాంగ్రెస్‌ ‌పార్టీ..

కరెంట్‌పై మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదు
మీటర్లు పెట్టది లేదని స్పష్టం చేసిన మంత్రి హరీష్‌ ‌రావు

కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారు…ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రయత్నం చేస్తుంది..అని మంత్రి హరీష్‌ ‌రావు కాంగ్రెస్‌ ‌పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ..రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులు 90 శాతం మంది ఉన్నారు. రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్‌ ‌చాలు అని పీసీసీ అధ్యక్షుడు అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చాక బోరు బావుల వద్ద మీటర్లు పెడతామని అద్దంకి దయాకర్‌ అన్నారు. సోనియాగాంధీ ఉచిత కరెంటుకు వ్యతిరేకం అని కల్వ సుజాత అన్నారు. దేశంలో రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కేవలం నాలుగు, ఐదు గంటలు మాత్రమే కరెంటు వచ్చేదని పేర్కొంటూ..రైతులకు ఏడు గంటల కరెంటు ఇవ్వలేమని కాంగ్రెస్‌ ‌ముఖ్యమంత్రి స్టేట్మెంట్‌ ఇచ్చారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే పాత పాలన తెస్తామని కాంగ్రెస్‌ ‌నేతలు చెప్తున్నారని, బషీర్‌ ‌బాగ్‌ ‌కాల్పులకు కేసీఆర్‌ ‌కారణం అనడం పెద్ద జోక్‌ అని హరీష్‌ ‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే కరెంటు నుండని,నాడు పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించాలని డిప్యూటి స్పీకర్‌గా ఉన్న కేసీఆర్‌ ‌చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారని, నాడు తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని మొదట స్పందించింది కేసీఆర్‌ అని, గడ్డిపోచల్లాగా పదవులు వదులుకున్న నాయకుడు కేసీఆర్‌..అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు. మీరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారు..కరెంటు 24 గంటలు వొస్తుందో లేదో కరెంటు తీగలు పట్టుకుని చూడమని సలహా ఇచ్చారు. వొచ్చే ఎన్నికల్లో పదేళ్ళ కాంగ్రెస్‌ ‌పాలనలో కరెంటు ఎలా ఇచ్చారో…తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలనలో కరంటు ఎలా ఇచ్చామో ప్రజల నుండి రెఫరెండం కోరదాము..అని హరీష్‌ ‌రావు సవాలు చేసారు. కాంగ్రెస్‌ ‌విధానం మూడు గంటలు…కేసీఆర్‌ ‌నినాదం మూడు పంటలు…బీజేపీ నినాదం మతం పేరిట మంటలు..అని విమర్శిస్తూ..ఎవరు కావాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు. దేశంలో కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని, కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో ప్రజలు 24 గంటల కరెంటు కావాలని డిమాండ్‌ ‌చేస్తున్నారని మంత్రి అన్నారు. 2004లో నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిందని, కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సీఎంగా వున్నప్పుడు 7 గంటలు కూడా కరెంటు ఇవ్వలేమని అన్నారు. తెలంగాణ వొచ్చాక అసెంబ్లీలో విద్యుత్‌ ‌సమస్య వుందని ఎవరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కరెంటు కోతలు, ఎండిన పంటలపై చర్చలు జరగలేదా..కాంగ్రెస్‌ అధికారంలో వున్నప్పుడు క్రాప్‌ ‌హాలిడేలు, పరిశ్రమలకు పవర్‌ ‌కట్‌ ‌చేయలేదా.. అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలను చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్‌ ‌రావు. నాడు చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్‌ ‌వొద్దు అంటే ప్రజలు ఇంటికి పంపించారని అన్నారు. తెలంగాణలో 30 లక్షల వ్యవసాయ కరెంటు మీటర్లు ఉన్నాయని, డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కారు ఉన్న దగ్గర డీజిల్‌ ఇం‌జన్లు ఉన్నాయని, ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యాపార కోణంలో చూస్తుందని, కేసీఆర్‌ ‌మానవీయ కోణంలో చూస్తున్నారని, నేడు నాణ్యమైన విద్యుత్‌ ‌వొస్తుంది కాబట్టే మోటార్లు కాలడం లేదని తెలిపారు. విద్యుత్‌ ‌పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేసీఆర్‌ 37 ‌వేల కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులు రాత్రి పూట నక్సలైట్లు అనుకుని రైతులను కాల్చి చంపిన చరిత్ర వుందని, కాంగ్రెస్‌ ‌పార్టీకి కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, ఇప్పటికైనా కాంగ్రెస్‌ ‌నేతలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, రైతుల్లో ఆందోళన రేకెత్తించే విధంగా కాంగ్రెస్‌ ‌నేతల మాటలు వున్నాయని హరీష్‌ ‌రావు అన్నారు. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమని అసెంబ్లీలో కేసీఆర్‌ ‌చెప్పారని, బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టకపోవడం వలన తెలంగాణ కేంద్రం నుండి 35 వేల కోట్లు నష్టపోయిందని, 35 వేల కోట్లు కాదు..65 లక్షల రైతుల భవిష్యత్‌ ‌ముఖ్యమని కేసీఆర్‌ ‌నిరూపించారని హరీష్‌ ‌రావు తెలిపారు. మీటర్లు పెట్టాలని భావిస్తే ఎప్పుడో పెట్టే వాళ్ళం కదా అని, కానీ రైతుల కోసం మీటర్లు పెట్టలేదని అన్నారు. కాంగ్రెస్‌ ‌విధానాలపై తమ పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్‌ ‌మాట్లాడితే బెదిరింపు ఫోన్స్ ‌వొచ్చాయని, రాజకీయంగా ఎదుర్కునక చేతకాక బెదిరింపులకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ ప్రజలకు ఏం సంకేతం ఇస్తుందనేది సమాధానం చెప్పాలని, దాసోజు శ్రవణ్‌పై బెదిరింపులను ఖండిస్తున్నామని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.
———————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page