స్మార్ట్ ‌సిటీ పనుల్లో అవకతవకలు

  • ఎవరినీ వదిలేది లేదన్న మంత్రి పొన్నం
  • కరీంనగర్‌ ‌మున్సిపాలిటీపై సమీక్షా సమావేశం

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 18 : ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పెద్దలు కరీంనగర్‌ అభివృద్ధిని విస్మరించారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌విమర్శించారు. కరీంనగర్‌లో•బుల్‌ ‌బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసునన్నారు. స్మార్ట్ ‌సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. జంక్షన్ల పేరుతో అంచనాలు పెంచారని వివరించారు. గతంలో జరిగిన తప్పుల గురించి ఆరా తీస్తున్నామని వెల్లడించారు. విజిలెన్స్ ‌విచారణ జరుగుతుందని.. నివేదిక వొచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. స్మార్ట్ ‌సిటీ పనుల్లో అవినీతి చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మరోసారి హెచ్చరించారు. తమ ప్రభుత్వం తీసుకునే చర్యలతో మరొకరు తప్పు చేయాలంటేనే భయపడే పరిస్థితి వొస్తుందని వివరించారు. కరీంనగర్‌ అభివృద్ధి తమకు ముఖ్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ ‌సందర్భంగా స్పష్టం చేశారు. డెవపల్‌ ‌మెంట్‌ ‌విషయంలో రాజకీయాలకు తావులేదని తేల్చి చెప్పారు. కరీంనగర్‌ ‌మున్సిపాలిటీపై సవి•క్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌, అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌లను నివేదిక తెప్పించుకోవాలని కోరడం జరిగింది..

ఇంజనీరింగ్‌ ‌విభాగం ,సిఎం అసురెన్స్ ‌ద్వారా 80 పనుల్లో జరిగినటువంటి పనులకు సంబంధించినవి, ఇంకా ప్రారంభం కానీ పనులు ఒకటే పని కింద 37 కోట్ల ప్రతిపాదన చేసినటువంటి పనులపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై ఎగ్స్క్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌స్థాయి నుండి ఆబ్జర్వ్ ‌చేయాలని చెప్పడం జరిగిందని, స్మార్ట్ ‌సిటీ లో భాగంగా అనేక అంశాలు ఉన్నాయని, పట్టణంలో 22 వైఫై హాట్‌ ‌స్పాట్‌లు ఉన్నాయవి ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు. టెక్నాలజీ కాంపోనెంట్‌ ‌కింద 98 కోట్లతో కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌నుండి 700 సీసీ కెమెరాలు పెట్టడం ,ఆడియోసౌండ్‌ ‌సిస్టం , టెలివిజన్‌ ‌ప్రసంటేశన్‌ ,‌సెన్సిటివ్‌ ‌ప్రాంతాల్లో అలారం లాంటి ఏర్పాటు కోసం కేటాయించడం జరిగిందని, సాంకేతికంగా భవిష్యత్‌లో ప్రజలు ఉపగించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వొచ్చిన తరువాత ఎవరైనా పేదల భూమిని ఆక్రమించి ఉంటే స్వేచ్చగా ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పామని, తమది ప్రజాస్వామిక ప్రభుత్వమని, అక్రమ దారులు ఎవరున్నా చర్యలు ఉంటాయని, అందులో రాజకీయ జోక్యం ఉండకుండా వాతావరణం క్రియేట్‌ ‌చేశామని, దాని ఫలితాలు కూడా చూశామని, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకుని అనధికారిక, అధికారిక దుర్వినియోగం ద్వారా పర్మిషన్‌ ‌తీసుకుని భవనాలు నిర్మించిన వారి వివరాలు తీసుకోవాలని చెప్పామని తెలిపారు.

రెవెన్యూ శాఖ తరుపున ఆర్డీవో ప్రభుత్వ భూముల్లో భవనాలు నిర్మించిన వారి వివరాలు తీసుకోవాలని చెప్పామని, సాంకేతికపరమైన భూమి ప్రభుత్వం అని చెప్పేలా సర్టిఫికెట్‌ ‌తీసుకుని తరువాత చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని భవన నిర్మాణాలపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వం తరుపున జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. శానిటేషన్‌లో వెహికిల్‌ ‌మేనేజ్మెంట్‌ ‌సిస్టమ్‌ ‌తదితర అంశాల పై చర్చించడం జరిగిందని, జిల్లా కలెక్టర్‌ ‌వచ్చే వారం నుండి ప్రతి వారం ఒక విభాగం పై సవి•క్ష జరపాలని కోరడం జరిగిందని, మున్సిపల్‌ ‌పనుల్లో పని చేసిన వారు ప్రాధాన్యత ప్రకారం బిల్లులు చెల్లించేలా ఫస్ట్ ‌కం ఫస్ట్ ‌రికార్డు ప్రకారం బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక పద్ధతి ప్రకారం బిల్లులు కేటాయింపు జరుగుతుందని, నిరంతంగా టాస్క్ ‌ఫోర్స్ ‌సిస్టంని ఏర్పాటు చేసుకుని మున్సిపల్‌కి సంబంధించి ప్రజల గ్రీవెన్స్, ‌స్థానిక సంస్థల అడిషనల్‌ ‌కలెక్టర్‌ ఎవరైనా మున్సిపల్‌ ‌సమస్యలను పరిష్కారం చేసుకునేలా ఉండాలని మంత్రి పొన్నం సూచించారు. వడ్డీలేని రుణాలు 1700 సంఘాలకు ఆన్‌లైన్‌లో ట్రాన్సఫర్‌ ‌చేయబడ్డాయని, పట్టణంలో మహిళా శక్తిని బలోపేతం చేస్తామని, భవిష్యత్‌లో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

మానేరు రివర్‌ ‌ఫ్రంట్‌ ‌ఫేజ్‌ 1 ‌లో 72 శాతం పనులు పూర్తయ్యాయని, ఫేజ్‌ 2 ‌పనులో డ్రైనేజీ సిస్టం ఇంక్లూడ్‌ ‌చేయడం జరిగింది త్వరగా ప్రారంభించాలి..టూరిజం ప్రాజెక్ట్ ‌ద్వారా అభివృద్ధి చేయాలని, గతంలో 100 కోట్లు నిధులు విడుదల చేశారని, 30 కోట్లు నిధులు మాత్రమే శాంక్షన్‌ అయ్యాయని, 5 కోట్లు ఖర్చు అయ్యాయని నివేదిక ఇచ్చారని, త్వరగా ఆ ప్రాజెక్ట్ ‌పూర్తి చేసేలా ముందుకు తీసుకుపోతున్నామని,.స్మార్ట్ ‌సిటీ లో భాగంగా ఇందిరా చౌక్‌ ‌లో కోటి 30 లక్షల బిల్లు ఉంటే 50 లక్షలు అదనంగా ఖర్చు చేశామన్నారు. అధికారికంగా అనుమతులు తీసుకొని నిర్మించబడ్డ వాటిపై విజిలెన్స్ ఎం‌క్వరి జరుగుతుందని, త్వరలోనే అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌నేతృత్వంలో విజిలెన్స్ ఎం‌క్వైరీ జరుగుతుందని, తప్పులు దొర్లుతున్న చోట చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. గతంలో పట్టణంలో పోలిసులు ,రెవెన్యూ ,మున్సిపల్‌ ‌ఫ్రీ సిగ్నల్‌ ‌లాగ ఉండాలని అనుకున్నామని, తరువాత సిగ్నల్‌లు ఏర్పాటు చేశారని, అయినప్పటికీ 6 ప్రాంతాల్లో మాత్రమే సిగ్నల్‌ ‌నడుస్తున్నాయని, కరీంనగర్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌తో పాటు ఇతర కార్పోరేషన్‌ ‌లలో ఓ విధాన పరమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని, మున్సిపల్‌ ‌పరిణితి, పని విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, పట్టణంలో ఏ తప్పూ జరిగిన పై వాళ్ల దృష్టికి తీసుకురావాలని,

ఇంజనీరింగ్‌, ‌టౌన్‌ ‌ప్లానింగ్‌, ‌శానిటేషన్‌ , ‌డ్రింకింగ్‌, ‌మహిళా సంఘాల బలోపేతం, రెవెన్యూలో ఆదాయం తక్కువ అవుతుంది..ఖర్చు ఎక్కువ అవుతుందని, పెద్ద పెద్ద సంస్థల నుండి వ్యవస్థల నుండి రావాల్సిన పన్నులు వసూలు చేయాలని కోరారు. చాలా కాలంగా పని చేస్తున్న వారందరిపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని,.తప్పు చేసిన అధికారులపై చర్యలు తప్పవని మంత్రి పొన్నం హెచ్చరించారు. విజిలెన్స్ ‌విచారణ జరుగుతుందన్నారు. సిఎం అస్యూరెన్స్ ‌కింద 132కోట్లు శాంక్షన్‌ అయ్యాయని, 60 కోట్ల పనులు పూర్తయ్యాయని, కొన్ని పెండింగ్‌ ఉన్నాయని, ప్రభుత్వాలు మారగానే పద్ధతులు మారవని, అయితే గతం కన్నా ఎక్కువ నిధులే తీసుకొస్తామని, కేబుల్‌ ‌బ్రిడ్జి ఎందుకు వొచ్చిందో ఎన్ని వాహనాలు ప్రయాణం చేస్తున్నాయో ప్రజలకు తెలుసునన్నారు. అర్బన్‌ ‌ట్రాఫిక్‌ ‌విధానంపై సవి•క్షా చేస్తామని, రాబోయే వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలుపై చర్యలు చేపడతామని, హాస్పటల్‌ ‌మీద త్వరలోనే రివ్యూ ఉందని, వర్షా కాలం వొస్తుండడంతో సీజనల్‌ ‌వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని జూచించారు. మున్సిపాలిటీ గౌరవం పెరగడానికి ఎవరు ఎలాంటి సలహాలు అయినా ఇవ్వచ్చని మంత్రి పొన్నం అన్నారు. కలెక్టర్‌ ‌తదితర అధికారులు సవి•క్షలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page