- ఎం.ఏ అండ్ యు.డి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్
- ప్రతిరోజు ఆంటీ లార్వా ఆపరేషన్లు ఉదయం 8 గంటల నుండి ప్రారంభించాలి
డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎం.ఏ అండ్ యు.డి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి అధికారులు, జిల్లా కలెక్టర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ లు, సీనియర్ ఎంటమాలజీ, ఏ ఎం హెచ్ ఓ లు, తహశీల్దార్ లు, అసిస్టెంట్ ఎంటమాజిస్ట్ లు చేపట్టాల్సిన కార్యాచరణ పై దిశ నిర్దేశం చేశారు.
డెంగ్యూ పాజిటివ్ కేసులన్నింటినీ తనిఖీ చేయాలని, ప్రతిరోజు బస్తీ దవాఖానాలను, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని జోనల్ కమిషనర్లు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా, ఇతర విక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధులను క్రమం తప్పకుండా డిసిలు, యస్ ఈ లు, ఏ ఈ లతో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని పాఠశాలలు కళాశాలలు హాస్టల్లను సందర్శించి డెంగ్యూ నివారణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
స్లమ్ ఏరియాలో పాజిటివ్ కేసులు గల ప్రాంతాల్లో ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, సీనియర్ ఎంటమాలజిస్టులు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు ప్రతిరోజు 5 నుండి ఆరు ప్రాంతాలను తప్పకుండా రీ చెక్ చేయాలని సూచించారు.