- విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం
- ప్రయాణికులకు నీళ్లు, ఆహార సేవలు అందించాలి
- అధికారులకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశం
న్యూది•ల్లీ,జూలై19: మైక్రోసాప్ట్ సర్వర్లలో సమస్యల కారణంగా విమాన సేవలు ప్రభావి తమ య్యాయి. చాలా కంపెనీల విమానాలు ఎగరలే కపోతున్నాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమా నాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సాంకేతిక సమస్యల తర్వాత భారత ప్రభుత్వం మైక్రోసాప్ట్ను సంప్రదించింది. అనేక దేశాల ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశాయి. స్పైస్జెట్, ఇండిగో,అకాసా ఎయిర్లైన్స్ కూడా ఇలాంటి సాంకేతిక సమస్యలను ఉదహరించాయి. ఇండిగో, స్పైస్జెట్ వంటి విమానయాన సంస్థలు సర్వర్ సమస్యల కారణంగా సర్వీసులు నిలిచిపోయాయని చెబు తున్నాయి.
తాజాగా ఈ సమస్య పరిష్కారమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమస్య వల్ల విమా నాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ అంశంపై తాజాగా పౌర విమాన యాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంతరాయం వల్ల ప్రభావితమైన ప్రయా ణికులకు నీరు, ఆహారం అందిస్తుందని మంత్రి తెలిపారు.ప్రయాణికుల పట్ల విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు సానుభూతితో వ్యవహరించాలి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణికులకు అదనపు సీటింగ్, వాటర్, ఆహారాన్ని తప్పక అందించాలి.
ప్రయా ణీకుల సురక్షిత ప్రయాణం కోసం టెక్నికల్ టీమ్ కృషి చేస్తోంది. ఇలాంటి సమాయాల్లో ప్రయాణీకుల సహకారం కూడా తప్పకుండా అవసరం. టెక్నికల్ సమస్య, విమాన సర్వీసుల రాకపోకలపై ఎలాంటి అప్డేట్ ఉన్నా ప్రయాణీకులకు వెంటనే తెలియజేయాలి. విమానాశ్రయాల్లో ప్రయాణీకుల అవసరాల కోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాం. మైక్రోసాప్ట్ సంస్థతో అధికారులు టచ్లోనే ఉన్నారు. వీలైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు.