సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే శ్రీ రామ రక్ష

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 21: సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే శ్రీ రామ రక్ష, సంక్షేమ పథకాలు కేసీఆర్ ను హ్యాట్రిక్సీఎం చేస్తాయని గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల,  ఉపేందర్ రెడ్డి అన్నారు. జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో ఏఎంసీ గజ్వెల్ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొన్నే జయమ్మ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కేసిఆర్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేశారన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కే  దక్కిందన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయలకు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతు బంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు.ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో గ్రామ అధ్యక్షులు జూపల్లి మధు, కొండపోచమ్మ డైరెక్టర్ గీత నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, కొన్నే స్వామి, తిరుమలాపురం తిరుపతి, రంజిత్ రెడ్డి, పోకల రాంచంద్రం, దయాకర్ రెడ్డి, బాబు, ప్రశాంత్, రమేష్,మ్యాదమైన సిద్దులు, పెద్దులు, ఆకారం నర్సింలు, చాకలి మల్లేశం,,ముక్కెర గిరి, బొల్లు ఐల్లయ్య, జూపల్లి బంగారి, నర్సింలు,
 గోదాల శ్రీనివాస్ రెడ్డి, ముక్కెర రాములు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page