నిమజ్జన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : గణేష్ నిమజ్జనోత్సవాలు జంట నగరాలకు కొత్త జోష్ తీసుకొచ్చాయి. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. లంబోదరుడి నిమజ్జనం సందర్భంగా జంట నగరాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్య చికిత్స అవసరమున్నవారికి అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. ’నిమజ్జన ప్రాంతాలల్లో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్లను, అత్యవసర చికిత్స కోసం , నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని మంత్రి దామోదర సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్లో నిమజ్జన ప్రాంతాలలో 30 చోట్ల హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేశారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు.