- వేదాశీర్వచనం చేసిన పండితులు
- కూతుళ్లతో కలసి తిరుమల శ్రీవారి దర్శనం
- చిన్నకూతురుతో డిక్లరేషన్ ఇచ్చిన పవన్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్… దీక్ష విరమణ కోసం తిరుమలకు వచ్చారు. మంగళవారం కాలిబాటన తిరుమలకు వచ్చిన ఉపముఖ్యమంత్రి బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ శ్రీవారిని దర్శించుకున్నారు.