గంగపుత్రులకు తీవ్రమైన అన్యాయం

  • ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు 
  • మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి హరీష్ రావు 

హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్16: రేవంత్ రెడ్డి ప్రభుత్వం వొచ్చిన తరువాత, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క చీర కాదు, మేము అధికారంలోకి వొస్తే రెండు చీరలు ఇస్తామని చెప్పారు..బతుకమ్మ రోజు ఒక్క చీర కాదు కదా… ఉన్న చీర కూడా బంద్ పెట్టారు అని మాజీ మంత్రి హరీష్ రావు బుధవారం తెలంగాణ భవన్ లో మీడియా చిట్ చాట్ లో అన్నారు . అధికారంలోకి వొస్తే రైతు బంధు రూ.10వేలు … రూ.15వేలు  ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని పేర్కొంటూ  కేసీఆర్ కిట్ బంద్ చేశారు..చేప పిల్లలు చెరువుల్లోనే వదలడం లేదు…  టెండర్ లు పిలవకుండా   చేప పిల్లలు తక్కువగా పోవాలని అధికారులు ఆదేశాలు ఇస్తూ  ముదిరాజ్‌లకు, గంగపుత్రులకు తీవ్రమైన అన్యాయం చేసింది ఆగస్ట్ లో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వొచ్చినా పోయలేదు ఈ ప్రభుత్వం, మేము 100కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్ లో పెట్టిందె 16కోట్లు  అని ఆరోపించారు. మార్పు మార్పు అని అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్… ఇవాళ ఈ మార్పులు చేస్తోంది అని విమర్శిస్తూ  రీజనల్ రింగ్ రోడ్ మా హయంలో ఉత్తర, దక్షిణ భాగం రెండు భాగాలుగా ప్రతిపాదన చేశాం.

ఉత్తర భాగం 158 కిలోమీటర్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది..భూసేకరణ కోసం 3A ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది… ఖర్చు మాత్రం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి సగం భరించేలా ప్రతిపాదన..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చి 10 నెలలు అవుతోంది, భూసేకరణ చేయడం లేదు… ఎందుకు ఆలస్యం జరుగుతోంది అని ప్రశ్నించారు. ” ఉత్తర భాగంలో యుద్ధ ప్రాతిపదికన మార్కెట్ విలువ ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాలి..ఐసిటి  వారికి దక్షిణ భాగంలో అలైన్మెంట్ ఫైనల్ చేయమని నేషనల్ హైవే అథారిటీ వారు చెప్పారు… 182 కిలోమీటర్ల అలైన్మెంట్ పూర్తి చేసింది. దక్షిణ భాగం అలైన్మెంట్ పూర్తిగా మార్చారు… ప్రముఖుల భూములు ఉన్నాయి అని అలైన్మెంట్ మార్చారు…ఒక్కసారి ఫైనల్ చేసిన అలైన్మెంట్ ని నేషనల్ హైవే అథారిటీ వారు ఒప్పుకోరు అని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం అలైన్మెంట్ మార్చింది..నేషనల్ హైవే అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అలైన్మెంట్ ని ఒప్పుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం 20 వేల కోట్లుతో దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ నిర్మించబోతుంది..

అలైన్మెంట్ మార్చడం వల్ల 182 కిలోమీటర్ల నుంచి 198 కిలోమీటర్లకు పెరిగింది..కాంట్రాక్టర్ల లాభం కోసం 20 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తున్నారు..రుణమాఫీ కోసం అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల అంటున్నారు… అలైన్మెంట్ మార్చడం వల్ల 20 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు మరి? మీ లాభం కోసం 20,000 కోట్ల అప్పు చేస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వం ఎసిడిపి  నిధులను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ  మాజీ మంత్రి హరీష్ రావు ప్రజా పాలన అని గొప్పగా చెప్పిన ప్రభుత్వం… బడ్జెట్‌లో పొందుపర్చిన విధంగా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఎసిపిడి  నిధులు 5 కోట్లు ఇస్తామని చెప్పారు..6 నెలలు అవుతున్నా ఒక్క రూపాయి ఇవ్వలేదు. కనీసం ఉత్తర్వులు కూడా జారీ చేయలేదు..వెంటనే ఎసిడిపి  నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page