రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి పటిష్ట ప్రణాళిక

  • వినియోగ‌దారుల‌కు నాణ్య‌మైన విద్యుత్ అందించాలి..
  • రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పొలంబాట‌
  • డిప్యూటీ సీఎం ఆర్థికవిద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క
 రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వినియోగదారులకు మెరుగైననాణ్యమైన విద్యుత్‌ సేవలందించాల‌నిఉపముఖ్యమంత్రిఆర్థికవిద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.  మంగళవారం ఖ‌మ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మంవరంగల్ జిల్లాల విద్యుత్ అధికారులతో విద్యుత్ శాఖ పనితీరుపైవిద్యుత్ శాఖ సిఎండి వరుణ్ రెడ్డిఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క‌ మాట్లాడుతూ.. రాబోయే కాలానికి అనుగుణంగా విద్యుత్ వినియోగం ఎంత ఉన్నా అందించేందుకు  ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. గరిష్ట డిమాండ్ ఉన్నా విద్యుత్ సరఫరా అందించామని తెలిపారు. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలువరదల సమయంలో అర్థరాత్రి సైతం నీళ్లల్లో పనిచేసిన విద్యుత్ సిబ్బందిని అభినందించారు. ఆపత్కాల సేవలు వెలకట్టలేవని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలనిసమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని భ‌ట్టి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page