Breaking: కవితకు బెయిల్

దిల్లీ మద్యం పాలసీ కేసులో బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కు సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత మార్చ్ 15 న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి తిహాడ్ జైలులో ఉన్న కవితకు మంగళ వారం దేశ అత్యున్నత న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది.

సొంత పూచి కత్తు, ఈడీ, సిబిఐ ల కేసుల్లో రు. 10 లక్షల బాండ్లు సమర్పించాలని కోర్టు పేర్కొంది. గత 5 నెలలుగా కవిత జైలు లో ఉన్నారు. బి ఆర్ ఎస్ నాయకులు కవితను ఈ రోజే జైలు నుంచి విడుదలకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్య నాయకులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు పలువురు పార్టీ నాయకులూ ఇప్పటికే దిల్లీ లో మకాం వేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page