ఉత్సాహంగా సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీలు

పెద్ద సంఖ్య‌లో పాల్గొన్న యువ క్రీడాకారులు

నాగర్ కర్నూల్,  వనపర్తి జిల్లా కేంద్రాల్లో యువ క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడా ర్యాలీలు నిర్వ‌హించారు.  శుక్రవారం  నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన టార్చ్ రిలే కార్యక్రమంలో కలెక్టర్ బి.సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ లు ముఖ్యఅతిథిలు గా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్, కరాటే అసోసియేషన్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ప్రతినిధులు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా  యువజన, క్రీడాభివృద్ధి అధికారి సురేందర్ రెడ్డి సమన్వయం చేశారు. అలాగే జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి సీతారాములు ఆధ్వ‌ర్యంలో వ‌న‌ప‌ర్తి లో వందలాది మంది యువ క్రీడాకారులతో  జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎస్పీ వెంకటేశ్వరరావులు క్రీడాజ్యోతి ర్యాలీని ప్రారంభించారు. వివిధ పాఠశాలల కళాశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ‌నివారం జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వ‌హించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page