అపరిచితుడిలా మాట్లాడుతున్న రేవంత్‌

  • మూసీపై రోజుకో మాటతో ప్రజల్లో గందరగోళం
  • మూసీని మురికికూపంగా చేసిన ఘనత కాంగ్రెస్‌దే
  • మూసీలో వరదలు వొచ్చినా..నీళ్లునిలిచే ప్రసక్తే లేదు
  • పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌18: ‌మూసీ సుందరీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ.. అపరిచితుడిలాగా మారిపోయాడని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. మూసీ సుందరీకరణ చేస్తాం అని మొట్టమొదట చెప్పిందే రేవంత్‌ ‌రెడ్డి.. కానీ నిన్న ప్రెస్‌ ‌ట్లో అసలు సుందరీకరణ మాట ఎక్కడి నుంచి వొచ్చిందని అంటున్నాడని కేటీఆర్‌ ‌ఫైర్‌ అయ్యారు. తెలంగాణ భవన్‌లో మూసీపై కేటీఆర్‌ ‌పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రేవంత్‌ ‌రెడ్డి ఒక రోజు సుందరీకరణ అంటాడు.. మరొక రోజు ప్రక్షాళన అంటాడు.. మరో రోజు పునరుజ్జీవం అంటాడు అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ అనే మాట మొట్టమొదటు వాడింది రేవంత్‌ ‌రెడ్డి. గోపన్‌పల్లిలో మాట్లాడుతూ లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఆయన ఒక అపరిచితుడిలా మారారు. ఆయన నోట్లో నుంచి అబద్దాలు వొస్తున్నాయి. లక్షన్నర కోట్లు ఎవరు అన్నారని అంటుండు. నల్లగొండకు మంచినీళ్లు ఇస్తుంటే కు మనసున పడుతలేదా అంటున్నాడు. నల్లగొండ జిల్లా ప్రజలను రెచ్చగొడుతున్నాడని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళన ఇష్టం లేదని అంటే ఖర్చు పెట్టిన రూ. 140 కోట్లు నా ఆస్తి అమ్మైన కడుతా అని రేవంత్‌ ‌రెడ్డి అంటున్నాడు. రేవంత్‌ ‌రెడ్డి అఫిడవిట్‌లో ఏమో రూ. 30 కోట్లే తన ఆస్తి అని చూపించాడు. మరి రూ. 140 కోట్లు తమ్ముడి స్వచ్‌ ‌బయో కంపెనీ నుండి తేస్తాడా, బావమరిది అమృత్‌ ‌కంపెనీ నుండి అమృతం ఏమైనా జుర్రుతాడా? అని కేటీఆర్‌ ‌విమర్శించారు.

మూసీ మురికి కూపంగా మారిందన్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా.. మూసీని మురికి కూపంగా మార్చింది కచ్చితంగా గత పాలకులే.. అందులో సింహభాగం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానిది అయితే.. కొద్దిభాగం టీడీపీ ప్రభుత్వానికి కూడా దక్కుతుందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. మూసీ స్టోరీ ఏంటని ఆలోచిస్తే.. మూసీ నది కృష్ణానదికి ఉపనది. పైన అనంతగిరి కొండల్లో ముచ్‌కుంద వద్ద మూసీ ఉద్భవించింది. 267 కి.. ప్రయాణం చేసి హైదరాబాద్‌ ‌నగరం మీదుగా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 1591లో కులీకుతుబ్‌ ‌షా హైదరాబాద్‌ ‌నగరాన్ని మూసీ తీరాన నిర్మించారు. రెండు నదులుగా మూసా ఈసాగా ప్రారంభమై.. హైదరాబాద్‌లోని బాపు ఘాట్‌ ‌వద్ద మూసీ నదిగా ఏర్పడుతాయి. గతంలో ఈ నదిని ముచ్‌కుంద అని కూడా పిలిచేవారు. 1908లో మూసీలో ఒక భయంకరమైన వరద వొచ్చింది. కుంభవృష్టి లాంటి వర్షం పడడం కారణంగా అతి పెద్ద వరద సంభవించి 15 వేల మంది మరణించారు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌హైదరాబాద్‌ ‌ప్రజలను వరద నుంచి కాపాడాలని చెప్పి.. నాటి ప్రముఖ ఇంజినీర్‌ ‌మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిచి చర్చించారు.

నాడు ఆయన డిజైన్‌ ‌చేసింది ఉస్మాన్‌ ‌సాగర్‌(‌గండిపేట) 1920లో పూర్తయింది, హిమాయాత్‌ ‌సాగర్‌ 1927‌లో పూర్తయింది. ఈ రెండింటి రిజర్వాయర్ల వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఒకటి హైదరాబాద్‌ ‌ప్రజలకు మంచినీరు అందించడం, రెండోది భారీగా వరదలు వొచ్చినా వాటిని ఆపేందుకు, హైదరాబాద్‌లో ఆవాసాలు మునగకుండా, ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా.. రక్షణ కవచం లాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండు రిజర్వాయర్లు నిర్మించారు. ఆ తర్వాత 95 ఏండ్ల పాటు మూసీలో ఏ ప్రభుత్వం గొప్పగా పని చేసింది లేదు అని కేటీఆర్‌ ‌తెలిపారు. మూసీకి ఒక ప్రత్యేకత ఉంది. పశ్చిమం నుంచి తూర్పు వైపునకు ప్రవహిస్తోంది. పశ్చిమాన ఉండే మంచిరేవుల వద్ద తీసుకుంటే.. ఈస్ట్‌లో ఉండే ఓఆర్‌ఆర్‌ ‌దాకా 57.5 కిలోటర్లలో 84 టర్ల కిందకు ఫాస్ట్‌గా ప్రవహిస్తుంది. ఇది ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పొచ్చు. వరద వేగంగా కిందకు జాలువారుతుంది. రెండోది గతంలో ఉన్న ఎంసీహెచ్‌, 2007-08‌లో ఏర్పడ్డ జీహెచ్‌ఎం‌సీ కానీ.. ఈ పరిధి తీసుకుంటే 90 శాతం రెయిన్‌ ‌వాటర్‌, 90 ‌శాతం సీవరేజ్‌ ‌కానీ గ్రావిటీ ద్వారా మూసీలోకి వొస్తుంది. 54 ప్రధాన నాలాలు ఉన్నాయి. అవన్నీ కూడా 90 శాతానికి పైగా గ్రావిటీ రూపంలో ఉన్నాయి.

నాచారం, జీడిమెట్ల, బాలానగర్‌, ‌మల్లాపూర్‌ ‌నుంచి కొన్ని వ్యర్థాలు 90 శాతానికి పైగా మూసీలో కలుస్తున్నాయి. మూసీలో ఒక్క చుక్క నీరు వదిలినా నిల్వదు.. ఉస్మాన్‌ ‌సాగర్‌, ‌హిమాయత్‌ ‌సాగర్‌ ‌గేట్లు ఎత్తినా జరజర నీరు కిందకు పోతోంది. అలా మోక్షగుండం విశ్వేశ్వరయ్య రిజర్వాయర్లను ప్లాన్‌ ‌చేశారు. ఎలాంటి ఉపద్రవం లేకుండా బ్యాల్సెనింగ్‌గా రూపొందించారు. ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోవొచ్చు అని చాలా ముందు చూపుతో మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఈ ‌రెండు రిజర్వాయర్లను కట్టించారని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. కేసీఆర్‌ అధికారంలోకి వొచ్చాక సెంట్రల్‌ ‌పొల్యూషన్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డు రిపోర్టు తెప్పించుకున్నాం. మూసీ మురికికూపంగా మారింది. బీవోడీ, సీవోడీ ఈ రెండింటిలో కూడా మూసీ ప్రమాదభరితమైన స్థాయిలో ఉందని రిపోర్టులో చెప్పారు. 2016 దాకా మున్సిపల్‌ ‌మినిస్టర్‌గా కేసీఆర్‌ ఉన్నారు. ఆ తర్వాత నేను మున్సిపల్‌ ‌మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. కేసీఆర్‌ ‌మార్గదర్శకత్వంలో అక్కడ ఉండే పరిస్థితులను అధ్యయనం చేసి పునరుజ్జీవం, సుందరీకరణ చేసే విధంగా సంకల్పించాం అని కేటీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page