త్రిగుణాత్మకం స్వరూపుడు , తైమూర్త్య భావనతో విరాజిల్లుతున్న వినాయకుడు వైదిక కాలం నుండి భారతా వనిలో ఆది దైవ స్వరూపంగా ఉపాసించ బడుతున్నాడు . ప్రకృతిలో రజస్తమో గుణాది స్వరూపు డైన విఘ్నేశ్వరుని ‘ గుణేశుడు ‘ అని అభివర్ణించారు. కాలక్రమేణ గణేశుడు అయినాడు . గాణాపత్యం సంప్రదాయానుసారం గణము అనగా సత్య రజస్తమో గుణ సమ్మేళనం. ఈ త్రిగుణాధిపతి విఘ్నేశ్వరుడు పురాణేతిహాసాల బట్టి సకల దేవతా గణాలకు అధిపతి కనుక గణపతి సార్థక నామధేయం కలిగింది. లింగ పురాణం ప్రకారం బలగర్వితులైన రక్కసులు, స్వర్గ లోకాన్ని ఆక్రమించి, దేవతలను అష్ట కష్టా లకు గురి చేయగా వారు పరమ శివుని ప్రార్థించగా, ఆయన రాక్షస సంహారానికి గణపతిని సృష్టించి, రాక్షసులను సంహరించ మనగా , అందులో తన ప్రమేయం లేదని, ఆగ్రహించిన పార్వతి, పరమేశ్వరునిపై కోపాన్ని గణపతిపై ప్రదర్శించి, ఏనుగు తలతో , బాన కడుపు తో , వికార రూపుడై ఉండునటు శ పించగా, చింతా క్రాంతుడైన గణేశుని, శివు డూరడించి, సకల దేవత గణాధిపతిగా, సకల విఘ్న నివారణ దైవంగా అనుగ్రహించాడు.
మరో కథనం ప్రకారం గజాసురుని సంహరించి, పరమేశ్వరుని అనుగ్రహంతో పార్వతి చేత పిండి బొమ్మగా చేయబడి, ప్రాణాలు కోల్పోయిన గణపతి, గణాసురుని తలతో పునరుజ్జీవితుడైనట్లు ప్రచారంలో ఉంది. పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ కొలనులో ఉండగా , గజదంపతుల శృంగారాన్ని చూచి మైమరచి, తామూ అదే రూపాలతో క్రీడించగా గజముఖుడైన గణపతి ఆవిర్భవించినట్లు ఐతిహ్యం. గణపతి, పరమేశ్వరునికి తనయుడే కాకుండా విష్ణు రూపుడు కూడా. ” శుక్లాం బరధరం విష్ణుం, శశివర్ణం” అన్న ప్రస్తుతి నిరంతరం పఠితమే. పృధ్వీతత్వం ప్రధానంగా కలవారు పరమేశ్వరుని, జలతత్వం కలవాడు గణపతిని, తేజస్తత్వం కలవారు దుర్గా మాతను, వాయుతత్వం కలవారు సూర్యుని, ఆకాశ తత్వం కలవారు విష్నువు ను ప్రార్థిస్తు ఉండగా , కేవలం ఒక దేవతా మూర్తి కి ఏ శుభకార్యంలో నైనా, తొలి పూజ గావించడం పాంచభౌతిక శరీరధారు లైన మానవులు ఆచరించే సంప్రదాయం, ప్రత్యేకం. సకల దేవతా మూర్తి యైన గణేశుని శుభకార్యాలో తొలి పూజార్హుని చేయడం సనాతన ఆచారం.
భాద్రపద శుక్లపక్ష చవితి నాడు గజాసుర సంహారం చేసినందున ఆనాటి నుండే గజానన పూజ ప్రారంభ మైనట్లు కథనం. భాద్రపద శుద్ధ చవితినాడు గణా అధిపతియైన విఘ్నేశ్వరునికి యథా విధిగా ఏకవింశతి పత్రాలతో అర్చించి, తరించడం భారతా వనిలో తరతరాలుగా కొనసాగుతున్న సంస్కృతికి ప్రతీక. వినాయక చవితి జాతీయ సమైక్య పర్వదినంగా లో కమాన్య తిలక్ లాంటి నాయకులు నిర్వహించారు. భారత దేశంలోనే కాక , విదేశాలలోనూ వినాయకుని ఆరాధన ఉంది. 13 వ శతాబ్ది నాటి గణపతి విగ్రహం కిరీటా లంకృతునిగా జావాలో లభించింది. సంయాములో లభించిన విఘ్నేశ్వరుడు కూర్మ వాహనుడు. ఒక చేతిలో చింతామణిని ధరించి ఉండడం ఈ విగ్రహ ప్రత్యేకత. ఈ బొమ్మ ఉన్న వ్రాతప్రతి హనో యు లభించింది.
జపాన్ సుమో యోధులు కుస్తీ ఫోజులో ఉన్న గణపతి ద్వయ విగ్రహం లభించింది. క్రీ.శ, 14వ శతాబ్దికి చెందిన గణపతి విగ్రహం కంబోడియాలో లభించగా, విద్యా ప్రదాతగా కొలిచే ఈ గణపతి చేతులలో పుస్తకం, గంటంగా ఉపయోగించే దంతం ఉన్నాయి. చైనా , జపాన్ లో లభ్యం కాబడిన గణేశ గ్రహాలు ఒక చేతిలో గొడలి, మరో చేతిలో కేరెట్ పటుకుని ఉండగా , వీటిని గర్భధాతు గణపతు లంటారు. శక్తితో కూడిన హేరంబ గణపతి విగ్రహం టిబెట్ లో లభ్యమైంది. హేరంబ గణపతి పంచభూతాల తత్వాన్ని సూచించే రూపంలో సింహాసనాసీనుడైన, నృసింహ గణపతి తత్వాల మేళవింపుగా అనాది కాలం నుండి పూజార్హమై ఉంది. ధన్వంతరిగా లంబోదరుడు ఉదర సంబంధ వ్యాధులను నయం చేసే దేవతగా కొలువ బడుతున్నాడు.
అష్ట వినాయకులుగా ప్రసిద్ధి పొందిన దేవతా రూపాలు మహారాష్ట్రలో నెలకొని ఉన్నాయి. వికటరాజ రూపంలో మోరేగావ్లో మయారేశ్వరునిగా, పాలి గణపతి రూపంలో భల్లారే శ్వర్ లో లంబో దరునిగా , మాత్ లో వరద వినాయకునిగా, మహోదర రూపంలో ఓజార్ లో, విఘ్నేశ్వరుని గా విఘ్నరాజ రూపంలో లెన్యాద్రిలో , గిరిజాత్మజ రూపంలో ధూమ్రవర్ణునిగా, తేవూర్లో చింతా మణి రూపంలో వక్ర దంతునిగా , సిద్దిటేక్ లో సిద్ది వినాయక రూపంలో సిద్దేశ్వర స్వామిగా , రంజన్ గావ్లో మహా గణపతి రూపంలో గజాననునికి మహారాష్ట్ర గణపతి ఆరాధన భూమిగా నిలచి ఉంది.
– రామకిష్టయ్య సంగనభట్ల…
9440595494.