వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహా రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మాడ వీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పారవశ్యంతో.. గోవిందానామస్మరణతో వీధులు మారుమోగుతున్నాయి.
స్వామివారికి కర్పూర హారతులిచ్చి నైవేద్యాలు సమర్పించారు. అనాది నుంచి రాజులకు రథసంచారం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల మాడ వీధుల్లో శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తున్నాడు. బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే ఈ రథోత్సవం ప్రసిద్ధమైంది. తిరుమాఢ వీధుల్లో రథంపై ఊరేగుతున్న శ్రీనివాసునికి భక్తితో నమస్కరిస్తూ ఓం నమో వేంకటేశాయ నామస్మరణ చేస్తున్నారు భక్తులు.