నేటి గణేశ్‌ ‌నిమజ్జనం కోసం మెట్రో సేవలు

అర్థరాత్రి 1 గంటవరకు సర్వీసుల పొడిగింపు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌హైదరాబాద్‌  ‌నగరంలో గణేశ్‌ ‌నిమజ్జనం దృష్ట్యా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ ‌రెడ్డి తెలిపారు.  17న అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు.  ఖైరతాబాద్‌, ‌లక్డికాపూల్‌ ‌మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేటు భద్రతా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రద్దీకి అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్‌ ‌కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, నిమజ్జనాలను వీక్షించేందుకు తరలివ‌చ్చే భక్తులు మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page