స్థానిక ఎన్నికలపై సిఎం రేవంత్‌ కసరత్తు

త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణ
స్థానిక ఎన్నికలపై అధికారులతో సవిూక్ష
త్వరలోనే వివరాలు వెల్లడిరచనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్దమవుతుంది. పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడం, బడ్జెట్‌ సమావేశాలు కూడా ముగింపునకు రానుండడంతో ఒకటి రెండు నెలల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుంది. దీనికి తోడు వాతావరణం కూడా ఇప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. దీంతో ప్రజల్లో సానుకూలత ఉన్నప్పుడే ఎన్నికల్లో లబ్ది పొందాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వొచ్చే నెలలో అంటే ..మరి కొద్దిరోజుల్లోనే నగారా మోగనుందని తెలుస్తుంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి, ఆగస్టు నెల చివరి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే ఐదేండ్ల క్రితం ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నం దున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని, ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో పంచాయితీరాజ్‌  శాఖ మంత్రి సీతక్కతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి వారం రోజుల క్రితం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడిరచాలని అధికారులకు సీఎం సూచించారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును రేవంత్‌కు అధికారులు వివరించారు. ఇప్పటికే కులగణనకు ఆమోదం తెలిపినందున, దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని అధికారులను సీఎం ప్రశ్నించారు.

 

కర్ణాటకలో 2015లో, బీహార్‌లో 2023లో కుల గణన చేశారని, ఆంధప్రదేశ్‌లో కులగణన చేసినా వివరాలు ఇంకా బయట పెట్టలేదని అధికారులు వివరించారు. 2011లో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కులగణన ఫార్మాట్‌ 53 కాలమ్స్‌తో ఉన్నదని, దానికి మరో మూడు కాలమ్స్‌ జోడిరచి కులగణన చేపడితే కనీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ల పెంపు అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది. మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో గత ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page